PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుంచి ప్రజావేదిక.. గ్రామాలకు ప్రత్యేక అధికారులు

1 min read

తలముడిపిలో ఈనెల 21న ‘ప్రజా వేదిక’కార్యక్రమానికి హాజరుకానున్న ఎమ్మెల్యే..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నేటి నుంచి ఈనెల 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజా వేదిక అనే కార్యక్రమం జరుగుతుందని నంద్యాల జిల్లా మిడుతూరు ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి గురువారం అన్నారు.ఎంపీడీవో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు పూర్తి అయిన శుభ సందర్భంగా ప్రజా వేదిక అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు అదేవిధంగా ఈ ఏడు రోజుల్లో మండల అధికారులకు కానీ గ్రామాల్లో ఉన్న ప్రతి అధికారికీ ఎవ్వరికీ కూడా సెలవులు లేవన్నారు.మీమీ గ్రామాల్లో ప్రజా వేదిక కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులను నాయకులను పెద్దలను పంచాయతీ కార్యదర్శులు ఆహ్వానించాలని ప్రతి ఇంటింటికి వెళ్తూ ఇండ్లకు స్టిక్కర్లను అతికించాలన్నారు. ఈనెల 21వ తేదీన తలముడిపి గ్రామంలో ప్రజా వేదిక అనే కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొంటారని  ఎంపీడీవో తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగే ప్రజా వేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *