PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూదరులు అరెస్ట్ – నగదు స్వాధీనం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని కొండపేట బ్రిడ్జి కి వెనుక వైపున పేకాట ఆడుతున్న నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు సీఐ టి.నారాయణ యాదవ్ తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, కొండపేట బ్రిడ్జి వెనుక వైపు జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్వహించామని సీఐ నారాయణ యాదవ్ తెలిపారు, ఈ దాడుల్లో అక్కడ జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి పేక ముక్కలు, అలాగే 3,320 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేసి నట్లు సీఐ నారాయణ యాదవ్ తెలిపారు.

About Author