PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మట్టి గణపతిని ప్రతిష్టించడం అభినందనీయం

1 min read

కేడీసీసీ బ్యాంకు జనరల్​ మేనేజర్​ రామాంజనేయులు

కర్నూలు, పల్లెవెలుగు:  మట్టి గణపతిని ప్రతిష్టించి… పూజించడం అభినందనీయమని కేడీసీసీ బ్యాంకు జనరల్​ మేనేజర్​ రామాంజనేయులు ​ అన్నారు. శనివారం కలెక్టరేట్​ ఆవరణలోని సమాచార శాఖ భవన్​లో పాత్రికేయ వినాయక మిత్ర మండలి నేతృత్వంలో ప్రతిష్టించిన వినాయకుడిని ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమాచార శాఖ భవన్​ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ​ కేడీసీసీ జనరల్​ మేనేజర్​ రామాంజనేయులు మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణకు పాత్రికేయుల కృషి ప్రశంసనీయమన్నారు. ప్రతిఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టిస్తే.. పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు. అనంతరం పాత్రికేయ వినాయక మిత్రమండలి నిర్వాహకులు విద్యాసాగర్​, శ్రీనాథ్​ రెడ్డి మాట్లాడుతూ ప్రప్రథమంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించామని, ఇందుకు పాత్రికేయులు, దాతలు పూర్తిగా సహకరించినందుకు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలియజేశారు.  కేడీసీసీ బ్యాంకు జనరల్​ మేనేజర్​ రామాంజనేయులును  పాత్రికేయులు ఘనంగా సన్మనించారు. కార్యక్రమంలో విశాలాంధ్ర బ్యూరో శ్రీనివాసులు గౌడ్​, వార్తా స్టాఫర్​ ప్రకాశ్​, ఆంధ్ర జ్యోతి మల్లికార్జు, పల్లెవెలుగు రవికుమార్​ మన దినపత్రిక స్టాఫర్​ విజయ్​, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *