PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాణ్యం టిడిపి అభ్యర్థిగా గౌరు చరితా రెడ్డి నామినేషన్..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం నాడు గౌరు చరిత రెడ్డి నామినేషన్ వేశారు కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ మెగాసిరి ఫంక్షన్ హాల్ వద్ద నుంచి అభిమానుల నడుమ గౌరు దంపతులు ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూల్ కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారపరెడ్డి మౌర్యకు నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి ఈసారి తన గెలుపు ఖాయమని ప్రజలలో మార్పు వచ్చిందని దౌర్జన్యం అభివృద్ధి మధ్య పోరాటంగా అభివర్ణించారు గత ఐదు సంవత్సరాల నుండి ప్రజలు వైసిపి పాలనలో బాధలు పడ్డారని టిడిపి వస్తేనే అభివృద్ధి అని ప్రజలకు తెలిసిందని భారీ మెజార్టీతో తన గెలుపు ఖాయమని నియోజకవర్గ ప్రజలకు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న టిడిపి జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్. పాణ్యం నియోజవర్గం జనసేన అధ్యక్షుడు చింతా సురేష్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

About Author