PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సంక్షేమ సారధి సీఎం జగన్ మోహన్ రెడ్డికే పట్టం కట్టండి

1 min read

వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో 16వ వార్డు నందు వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక ,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్ర గౌడ్ ,వార్డు కౌన్సిలర్ వహీద్,పార్టీ శ్రేణులతో కలిసి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అశేష ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయిన జగన్ ఇచ్చిన మాట మేరకు అనేక పథకాలు అమలు చేసి ప్రజా సంక్షేమానికి బాటలు వేశారని వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  కొనియాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ తెచ్చారని కొనియాడారు.జగన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని,ఈ ఎన్నికల్లో ఆయనను ఆదరిస్తారని పేర్కొన్నారు.ఇంటింటా కార్యక్రమం ప్రచారంలో భాగంగా ప్రజలు అపూర్వ ఘన స్వాగతం పలికారు. మే 13న జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి బుట్టా రేణుక ని, ఎంపీ అభ్యర్థిగా బి వై రామయ్య ని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించార.ఈ ప్రచారం లో వార్డ్ కౌన్సిలర్ వాహీద్, జిక్రియా, సుకూర్, బజార్ రెడ్డి, వాహబ్,అబిద్, సాజిద్ , గోవిందు,ఖీబ్రీయ,జావిద్, ఫరూక్,చాందు, రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారద, రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ మాచపురం వెంకటేష్, జిల్లా వక్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, మున్సిపల్ కోఆప్షన్ మెంబెర్ అబ్రార్,మాధవ స్వామి, డిష్ రఫీ,ఇంద్రసేనారెడ్డి, ఖజా, కౌన్సిలర్లు కేశవరెడ్డ,రాజారత్నం, ఇషాక్,నాయకులు మాజీకౌన్సిలర్ భాస్కర్ రెడ్డి,కలాం, రజాక్,మంజునాథ్, రఘువీర్, విద్యార్థి నాయకుడు సోమేశ్, కే.టీ గౌస్ బుట్టా యూత్ నాయకులు ఫయాజ్, ఉబేద్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author