PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చదువుతోనే బంగారు భవిష్యత్తు..

1 min read

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలి

కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు నగరంలోని కె.వి.ఆర్ ప్రభుత్వ కళాశాలను సందర్శించిన ఆయన , కాలేజీలో కలిపిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న విద్య గురించి  విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు.. తాను ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదువుకున్నానని, గవర్నమెంట్ బడులు, కాలేజీల్లో చదువుకోవడాన్ని చిన్న చూపుగా చూసుకోకూడదన్నారు.. ఇక కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఆయన…ఎం.పి నిధుల తో కాలేజీని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేసారు.. అంతకు ముందు కళాశాల సిబ్బంది ఎం.పి ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లాలెప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author