PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని టిడిపి నాయకులు కంచర్ల శివయ్య, గడ్డం నాగ పుల్లయ్య, గుద్దేటి నాగరాజు పేర్కొన్నారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో  రెండవ రోజు శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు, అధికారులు ఇంటింటికి తిరిగి ప్రచారం  నిర్వహించారు. వంద  రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్లను ఇంటింటికీ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ పథకాలు ప్రకటించి, అందులో ఒక్కోక్క హామీని  అమలుచేస్తోందన్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు అమలు చేసిందని,దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ అందివ్వబోతుందన్నారు.ప్రజల ఆకాంక్షలకు పట్టం కడుతూ,అభివృద్ధే లక్ష్యంగా, ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నిజం చేస్తూ,కూటమి ప్రభుత్వం రూపురేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య, టిడిపి మండల అధ్యక్షుడు మధు,టిడిపి నాయకులు మారెడ్డి సుబ్రహ్మణ్యం, మా రెడ్డి జయరాం,పంచాయతీ కార్యదర్శి సుమంత్, శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది,ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *