PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఏలూరు  నగర మేయర్ జన్మదిన వేడుకలు

1 min read

విచ్చేసిన ప్రముఖ రాజకీయవేత్తలు, అధికారులు, అనధికారులు,వివిధ పార్టీ నాయకులు,అభిమానులు

 ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) శుభాకాంక్షలు

వీరాభిమాని నాని అనాధాశ్రమ పిల్లలకు,దుప్పట్లు భోజన సదుపాయం ఏర్పాట్లు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జన్మదిన వేడుకలు పవర్ పేట తన క్యాంప్ కార్యాలయంలో అట్టాసహంగా అతిరథ మహారాజుల మధ్య వివిధ పార్టీ నాయకులు, అధికారులు, అనాది కారులు, మరియు పలు ప్రముఖ వ్యాపారవేత్తలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది విచ్చేసి మేయర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎం.మహిబాబు,పూజారి రంజాన్,మాజీ ఈడ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం,బొద్దాని, శ్రీనివాస్,ఏలూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు,కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ వివిధ విభాగాల అధికారులు,సిబ్బంది,పలువురు నగర ప్రముఖులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు దంపతులకు ఆశీర్వాదాలు అందించారు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,యస్. యం.ఆర్ పెదబాబు అభిమానులు,స్నేహితులు,ఫాలోవర్స్, నగరంలోని వివిధ వ్యాపార,వర్తక సంఘాల వారు,వార్డు సచివాలయాల సెక్రటరీలు, ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలు,మెప్మా ఆర్పీలు,సి ఓ లు తదితరులు పూలబొకేలుఇచ్చి,కేకులు కట్చేసి,శాలువాలు కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.మేయర్ నూర్జహాన్ పుట్టినరోజు సందర్భంగా వీరాభిమాని స్వామి స్నేహితుల ఆధ్వర్యంలో కలపర్రు టోల్గేట్ సమీపంలో ఉన్న అనాధాశ్రమం పిల్లలు 30 మందికి దుప్పట్లు అందజేసి,భోజనాలు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో ఉన్న 4 అన్నాక్యాంటీన్లకు వచ్చిన వారికి ఉదయం పూటటిఫిన్,మధ్యాహ్నం భోజనాలను ఉచితంగా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా  మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు చంటి,తెలుగుదేశం పార్టీ,వివిధపార్టీలకు చెందినవారు,వర్తక, వ్యాపారస్తులు అందరూ ఎస్ ఎం ఆర్ పెదబాబు  కుటుంబాన్ని ఎంతగానోఆదరించి,అభిమానించి. మమ్మలను మీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నందుకు ఎంతో గర్వపడుతున్నామన్నారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేశారు.

About Author