PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రహమత్ నగర్ పాఠశాలలో ఘనంగా “తిథి భోజనం”

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: నేడు స్థానిక రహమత్ నగర్ మండల పరిషత్ పాఠశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమం “శిక్షా సప్తాహ్” కార్యక్రమంలో భాగంగా చివరి రోజు శుభదిన్ భోజనం తిథి భోజనం నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ చాంద్ బాష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో BJP జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీశైలం నియోజక వర్గ కన్వీనర్ మోమిన్ షబానా పాల్గొని విద్యార్థులకు భోజనాలు, స్వీట్స్, పండ్లు అందజేశారు.ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని పాఠశాలల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు., భవిష్యత్తులో ఎవరైనా విద్యార్థులకు వారి శుభకార్యాల సందర్భంగా భోజనాలు అందించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం విద్య కోసం అనేక నిధులను కేటాయిస్తుoదని వాటిని విద్యార్థులు అందిపుచ్చుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో అతిథులు మండల విద్యాధికారి బాలాజీ నాయక్, సురేష్ కుమార్ స్థానిక టీడీపీ నేతలు అల్లి హుస్సేన్, పెట్రోల్ బంక్ భాష, ఖాజ సర్ఫ్ ద్దీన్, హాబీబుల్ల, హజ్రత్ అలీ, smd రఫీ, పాఠశాల ఉపాధ్యాయులు ముబీన పర్వీన్, యస్మీన్, అంతుల్ వహబ్ విద్యార్థుల తల్లి తల్లితండ్రులు పాల్గొన్నారు.

About Author