PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

1 min read

జిల్లా మంత్రులు, కలెక్టర్, ప్రజాప్రతినిధులు

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: వినాయకునికి పూజలు చేయడం వల్ల విజ్ఞతలు తొలగిపోతాయని…. వినాయక చవితి పండగను జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాలు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు కూడ ప్రజలందరూ గణేష్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి స్వరూపుడుగా వినాయకుడు ఉన్నట్టు చెప్పారు. ఆయన ఆశీస్సులతో ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్యక్తిగత, సామూహిక లక్ష్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. నూతన విశ్వాసం, సంకల్పంతో సరికొత్త ప్రారంభాలు జిల్లా సమగ్రాభివృద్ధిని తీసుకురావాలని అక్షాంస్తూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *