PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో హర్గర్ తిరంగా యాత్ర                 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారి పిలుపుమేరకు బిజెపి,టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు . అందులో  భాగంగా పత్తికొండ పట్టణంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు తిరంగ యాత్ర (బైక్ ర్యాలీ) నిర్వహించారు. పత్తికొండ బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు మాట్లాడుతూ, జాతీయ భావాలను, జాతీయతను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలన్నారు. భారత జాతి గొప్పతనాన్ని చాటి చెప్పేలా దేశభక్తిని ప్రదర్శించాలన్నారు. భారత జాతి గొప్పతనాన్ని ఇనుముడింపజేసే జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు, న్యాయవాది తంబల నాగేష్, చంద్ర, టిడిపి నాయకులు విజయ మోహన్ రెడ్డి, జిల్లా కళాకారుల బృందం కన్వీనర్, ఎస్ రామ్మోహన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

About Author