PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైక్ నుండి కిందపడి చికిత్స పొందుతూ మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామానికి చెందిన సగినేల పుల్లయ్య(30)మృతి చెందినట్లు ఎస్ఐ జగన్ మోహన్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పుల్లయ్య భార్య స్వగ్రామం అయిన గడివేములకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బుధవారం రాత్రి 9:30 సమయంలో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు.తలకు బలంగా గాయాలు కావడం వల్ల అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం రాత్రి 10:30 కు మరణించాడని మృతుని తండ్రి సువార్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు   ఎస్ఐ తెలిపారు.మృతునికి భార్య ప్రమీల,కుమారుడు సంజయ్(5) ఉన్నారు.తర్వాత కడుమూరు గ్రామంలో సంపత్ కుమార్ అను వ్యక్తి వద్ద నుండి 20 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

About Author