ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు రాక
1 min readన్యాయ శాఖా మరియు మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నంద్యాల.. త్వరితగతిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6 వ తేదీన హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు వస్తున్నట్టు మంత్రి ఫరూక్ చెప్పారు. కర్నూలు మండలం దిన్నె దేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ఫరూక్ వెల్లడించారు.