PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 నేను ప్రజల మనిషిని…ప్రజల కోసం పనిచేసే మనిషిని– ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం రామతీర్థం దగ్గర కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఎమ్మెల్య  విరుపాక్షి  ఈ కార్యక్రమాని ఉద్దేశించి మాట్లాడుతూ నేను ప్రజల మనిషిని.ప్రజల కోసం పనిచేసే మనిషిని.కార్యకర్తలను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను.ఎందుకంటే మన పార్టీ విజయం కోసం నాకోసం నాలుగు నెలలు అలుపెరుగని పోరాటం చేసి నన్ను విజయ్ తీరాలికి చేర్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి ముందుగా పేరుపేరునా ధన్యవాదాలు. మీరెవరు అధైర్య పడొద్దు అండి నేనున్నాను అన్ని నేను చూసుకుంటా ఐదు సంవత్సరాలు అధికార పార్టీతో లౌక్యంతోను దౌత్యంతోను పోరాటంతోను సాధించుకుందాం. కాణిపక్షంలో ప్రజల్లోకి పోయి వాళ్ల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కడదాం కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా నెల రోజులు కావస్తోంది ఈ నెల రోజుల్లోనే కొన్ని కొన్ని విధానాలకు మంగళం పాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ అయితే నేమి.అదేవిధంగా మన పార్టీ మీద కార్యాలయం మీద దాడి అయితే నేమి.పార్టీ కార్యకర్తల మీద దాడులైతేనేమి ఇవన్నీ ప్రజావ్యతిరేక విధానాలు అని తెలియజేస్తున్నారు ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళు.ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కానీ ప్రతిపక్షాన్ని భౌతిక దాడులతో నాయకులు కార్యకర్తలు ఎవరు ముందుకు రాకూడదని ఇలాంటి దుశ్చర్యలను పాల్పడిన పార్టీలు మనుగడలో ఉండవు అందుకే మనం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే మీ అందరి సహాయ సహకారాలు నాకు అవసరం మనం ఈ ఐదు సంవత్సరాలు సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించి.మళ్లీ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అవుతారని అంతవరకు ఓపిక సహనంతో మనం పార్టీని నడుపుకోవాలని అందరూ ధైర్యంగా ఉండండి ఎవరు అధైర్య పడొద్దు మంచి రోజులు ముందున్నాయి అని కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

About Author