PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హత్యకు కారకులైన నిందితులను ఉపేక్షించబోను – ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  ఆదోని మండలం పెద్దహరివనంలో హత్యకు గురైన బిజెపి కార్యకర్త  శేకన్నా పార్థివదేహాన్ని  ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్ధసారధి సోమవారం పరిశీలించారు.హత్యకు సంబంధించినటువంటి వివరాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.హత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి  మరియు నిందితులను పట్టుకోవడానికి 3 రకాల బ్యాచీలుగా డిపార్ట్ మెంట్ వారు గాలిస్తున్నారని ,హత్య చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  ఇలాంటి సంఘటన చోటు చేసుకోవటం చాలా బాధాకరం, శేకన్న కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు.

About Author