PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులు అలసత్వం వహిస్తే సహించను..ఎమ్మెల్యే

1 min read

ప్రజా సమస్యలను పరిష్కరించడానికి  మీ ముందు కాపలాదారుడుగా ఉంటా

 సమస్య తెలియగానే  వెంటనే రంగంలోకి

తడికలపూడి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజలే దేవుళ్లుగా భావించే ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధికారులు అలసత్వం వహిస్తే సహించను అన్నారు. ప్రజా సమస్యలపై పనిచేయండి అంతేకాని సాకులు చెప్ప వద్దు అంటూఅధికారుల పై మండిపడ్డారు. ప్రజలకు జవాబుదారీగా మనమంతా నిరంతరం పనిచేస్తూ ఉండాఅన్నారు. అర్ధరాత్రి నుండి ఉదయం వరకు  ప్రభుత్వ అధికారులు చేస్తున్న పరిపాలనపై  డేగ కన్నుతో  నిశితంగా గమనిస్తూ న్నని అన్నారు. తాను నియోజకవర్గంలో  సుడిగాలి పర్యటనలు  చేస్తూ ప్రజలకు మేలులు జరగాలనే ఉద్దేశంతో పరిపాలనలో వేగం పెంచారు. ఆయన లక్ష్యం ఆశయం ఒక్కటే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకున్న విధంగా  ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలనే  లక్ష్యంగా తాను నిత్యం ప్రజల మధ్య  పనిచేస్తున్నఅన్నరు. అర్ధరాత్రి సమయం లో ధర్మాజీగూడెం హాస్పటల్ ను సందర్శించి, ఉదయం అవగానే తడికలపూడి పోలీస్ స్టేషన్ లో ప్రజా సమస్యలను పరిష్కరించమని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇదంతా ప్రజల కోసమే కూటమీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన  అని చెప్పకనే చెప్పవచ్చుని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

About Author