PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏమాత్రం ఆదమరిస్తే..పల్టీ కొట్టాల్సిందే..

1 min read

పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు (నందికొట్కూరు): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విపరీతంగా వర్షాలు రావడంతో  పొలాల్లోకి వర్షం నీళ్లు చేరుతున్నాయి.రోడ్లు కుప్ప కూలుతున్నాయి. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని పీరు సాహెబ్ పేట-కడుమూరు గ్రామాల మధ్య నున్న గనెట్ బ్రిడ్జి దగ్గర మరియు మిడుతూరు కాకి లేరు వాగు దగ్గర రోడ్డు మీద నీళ్ళు విపరీతంగా రావడంతో తారు రోడ్లు కోతకు గురవుతున్నాయి.ఏ మాత్రం ప్రయాణికులు,వాహన దారులు ఆదమరిస్తే పల్టీలు కొటాల్సిందే..అధికారులు రహదారులకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.రోడ్లు కూలిన చోట్ల గుర్తు చిహ్నాలు ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

About Author