PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వడ్డెర యువకులను అక్రమంగా అరెస్ట్ చేయటం దుర్మార్గం

1 min read

అఖిల భారత ఒడ్డె ఓబ్బన్న సేవాసమితి

పల్లెవెలుగు వెబ్ గడివేముల : విజయవాడ లో జరిగిన వైస్సార్సీపీ బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్  పై రాళ్లు విసిరారని అజిత్ సింగ్ నగర్ కు చెందిన కొందరు వడ్డెర యువకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని కండిస్తున్నామని, ఆ యువకులు ఇతర పార్టీలకు చెందినవారని కావాలనే వాళ్లపై కక్ష పూరితంగానే కేసులు పెట్టి వారిని వాళ్ళ కుటుంబాలను వేదిస్తున్నారని,200 కూలి ఇస్తామని చెప్పి తీసుకెళ్లిన నాయకులు ఇలా అక్రమంగా కేసులలో ఇరికిస్తే వడ్డెర కమ్మ్యూనిటి చూస్తూ ఊరుకొనేది లేదని నంద్యాల జిల్లా అధ్యక్షులు బివిఎన్ రాజు అన్నారు. ఉపాధ్యక్షులు కుంచెపు చిన్న మాట్లాడుతూ  నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయం చేయాలె కానీ అనవసరమైన నిందలు మోపి ఇలా అమాయకులైన యువకులపై కేసులు పెట్టి వారి కుటుంబలను వేదీంచటం న్యాయం కాదని పోలీస్ వారు నిజానిజాలు  తెలుసుకొని మా యువకులను వదిలి పెట్టాలని డిమాండ్ చేశారు.

About Author