PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెన్సిల్ ముక్కపై  బాలకృష్ణుని చిత్రం

1 min read

సూక్ష్మ కళాకారిణి ప్రతిభ

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం కు చెందిన సూక్ష్మ కళాకారిణి ప్రతిభ కనపరచింది. పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనసాని నళిని మానసని అనే సూక్ష్మ కళాకారిణి బాలకృష్ణుని చిత్రాన్ని పెన్సిల్ ముక్కపై చెక్కి తన ప్రతిభను కనబరిచారు. ఆదివారం స్థానిక మనసాని రాఘవేంద్ర శెట్టి కుమార్తె అయిన సూక్ష్మ కళాకారిణి బాలకృష్ణుని ప్రతిమను 4 గంటల వ్యవధిలో 8.మి.మీ వెడల్పు, 1 సెం.మీ ఎత్తు పరిమాణంలో పెన్సిల్ పై చెక్కి అబ్బుర పరచడంతో గ్రామస్తుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. సందర్భాన్ని బట్టి పండగ లు, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు చెక్కి సూక్ష్మ కళాకారిణి నళిని పలువురు చేత ప్రశంసలు అందుకుంది.

About Author