PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ లోకి ఊపందుకున్న వలసలు

1 min read

100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆర్థర్

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వలసలు రోజురోజుకు ఊపందుకున్నాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఆర్థర్ కు బ్రహ్మరథం పడుతున్నారు. ఆర్థర్ నాయకత్వానికి నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా మైనారిటీ ,బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థర్ అభ్యర్థిత్వానికి జై కొడుతున్నారు. గురువారం నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి  మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన  ఎన్నికల ప్రచార కార్యక్రమంలో  కాంగ్రెస్  అభ్యర్థి  తోగూరు ఆర్థర్ పాల్గొన్నారు  . ఈ సందర్భంగా కొత్తపల్లి మండలంలోని ఎం. లింగాపురం, కొత్తపల్లి కి చెందిన 100 కుటుంబాలు ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆర్థర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ , ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు నాగ  మధు యాదవ్ మాట్లాడుతూ నందికొట్కూరులో  బడుగు బలహీన వర్గాల అభివృద్ధి   కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యమవుతుందని  అందుకే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ  హస్తం గుర్తుకు   ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ మొహమ్మద్ షరీఫ్,తాటిపాడు ఉస్మాన్ బాషా,ఓబులేష్ ,కొత్తపల్లి మండల సీపీఐ కార్యదర్శి వెంకటశివుడు, సీపీఐ ప్రతాప్, పాతకోట రమేష్,భీమ లింగం, లోకన్న,సురేష్, బాలకృష్ణ ,చంద్రశేఖర్, సత్యాలు,    తదితరులు పాల్గొన్నారు.

About Author