PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగాతో ఆరోగ్యం మస్తూ…

1 min read

ప్రధానోపాధ్యాయులు హంపయ్య

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  విద్యార్థి దశ నుంచే యోగా చేయడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులు హంపయ్య పేర్కొన్నారు. శుక్రవారం యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయులు రామన్న యోగాలోని కొన్ని ఆసనాలను చేసి విద్యార్థిని విద్యార్థులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగ చేయడం వల్ల శారీరక దృఢత్వము కలిగి మనసు ప్రశాంతంగా ఉంటూ చక్కటి సమన్వయంతో పని చేస్తాయని తెలిపారు. ఏకాగ్రతతో విద్యలో రాణించగలరని పేర్కొన్నారు. ఆసనాలు చక్కగా విద్యార్థులతో కూడా చేయించారు.  ధ్యానం గురించి ఉపాధ్యాయులు శ్రీనివాసులు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, విఠోబా, గోపాల్, బసవరాజు ఉమామహేశ్వరి, సుభాషిని, ప్రసన్న , రామకృష్ణ, హరి, పుష్పలత, ఈరన్న  స్టాఫ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

About Author