PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 జేఈఈ మెయిన్స్ లో.. ‘శ్రీ చైతన్య’ విజయకేతనం

1 min read

కర్నూలు,పల్లెవెలుగు: దేశ వ్యాప్తంగా విడుదలైన జె.యి.యి మెయిన్స్ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారని శ్రీ చైతన్య కళాశాళల ఎ.జి.ఎమ్. శ్రీ మురళీకృష్ణ గారు, డీన్ సరళ గారు మరియు డీన్ బాలాజీ గారు తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీలలో తమ విద్యార్థులు. కె. హర్శవర్ధన్ 180వ ర్యాంకు, ఎస్. యోగీశ్వర్ 308వ ర్యాంకు, డి. నోయల్ తనయ్ 399వ ర్యాంకు, పి.ప్రనీత్ రెడ్డి 486వ ర్యాంకు వంటి ఎన్నో ఉత్తమ ర్యాంకులు సాధించారని వారు తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు 195 మంది జె.యి.యి. అడ్వాన్స్కి అర్హత సాధించారని, గత ఏడాదికి, ఈ ఏడాదికి ఫలితాలు మెరుగుపడినట్లు ఎ.జి.ఎమ్. మురళీకృష్ణ గారు తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శ్రీ చైతన్య సరైన ఎంపిక అని నిరూపితమవుతున్నట్లు తెలియజేశారు. కళాశాలలో జరిగిన అభినందన సభలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించడంతో పాటు రాబోయే నీట్ మరియు అడ్వాన్స్డ్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

About Author