PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాఘవేంద్రుని సన్నిధిలో టిడిపి నాయకులు రాఘవేంద్ర రెడ్డి

1 min read

పల్లెవెలుగు  వెబ్ మంత్రాలయం :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలలో భాగంగా మధ్యారాధన పురస్కరించుకుని  దర్శించుకునేందుకు మంత్రాలయం టిడిపి సీనియర్ నాయకులు మాధవరం రాఘవేంద్ర రెడ్డి సతీమణి యశోద మ్మ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం వచ్చారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి కి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట కూతురు ప్రియాంక, కుమారులు ఎన్. రాకేష్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తో పాటు ఈ కార్యక్రమంలో మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్ఐ పరమేష్ నాయక్, టీడీపీ నాయకులు వరదరాజు, అశోక్ రెడ్డి, డేవిడ్, బావిగడ్డ రాఘన్న, భీమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author