PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

75 ఏళ్ల చరిత్రలో ఏ సీఎం బీసీలకు ఇoతటి గౌరవం ప్రాధాన్యత ఇవ్వలేదు

1 min read

ఫ్యాను గుర్తుకు ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించండి

రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో విజయవంతం చేయాలి

ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 75 ఏళ్ల చరిత్రలో ఎనాడు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయనంత వేగంగా ధైర్య సాహసల తోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీకులలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజ్యసభ  సభ్యులు ఆర్ కృష్ణయ్య యాదవ్ అన్నారు. మంగళవారం గ్రీన్ సిటీ ఎంపి అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్  క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు అధికారంలో, గౌరవంలో, విద్యలో, సంపదలో, బడ్జెట్ లో బీసీలను అభివృద్ధి చేయాలన్న అంకిత భావం,చిత్తశుద్ధితో మనకి గౌరవాన్ని అందించిన  నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో 11 మంది బీసీలకు ప్రాధాన్యత కల్పించారు అన్నారు. నేను దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగానని బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా బీసీలకు ఇoత ప్రాధాన్యత లేదన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్,చతిస్ గడ్, తమిళనాడు, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాల బీసీ ముఖ్యమంత్రిలుగా ఉన్న కూడా అమ్మ ఒడి పథకం, స్కాలర్షిప్ 20 వేలు, ,ఫీజ్ రియంబర్స్మెంట్, వంటి పథకాలు ఇవ్వ లేవన్నారు. గతంలో మన రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు లేవన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తి గా ఫీజు రియంబర్స్మెంట్ అందించారన్నారు. ఏలూరు చరిత్రలో ఏనాడు లేనివిధంగా ఒక బీసీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం చారిత్రాత్మకం అన్నారు. విద్యావంతుడు, సమర్థవంతమైన నాయకుడు సునీల్ కుమార్ అన్నారు.  ఇతన్ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో పోరాడి కేంద్ర బడ్జెట్ నుండి ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు తీసుకురావడానికి వీలు పడుతుందన్నారు. యువత కు ఉపాధి కల్పించేందుకు, అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలుంటాయన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి ఆయనను గెలిపించటం మన అందరి లక్ష్యమన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ లంతా ఐక్యతతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వైసిపి అభ్యర్థులకు ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అధికారం తీసుకురావాలన్నారు. ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా  రేపు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ కి రోడ్డు షోగా రానున్నారని ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ నెరుసు నాగ వెంకట సత్యo, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author