PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న వాల్మీకి నగర్ వైసీపీ కార్యకర్తలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  వాల్మీకి నగర్ వైఎస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సమక్షంలో దాదాపు 120 మంది బిజెపిలోకి చేరారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి సమక్షంలో BJP కర్నూల్ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ ఆద్వర్యంలో BJP కండువా కప్పి BJP కుటుంబం లోకి ఆహ్వానించారు.   ఈ సందర్భంగా బీజేపీ లోకి చేరిన కార్యకర్తలు  మాట్లాడుతూ BJP ఆశయాలు నచ్చి, నరేంద్ర మోడీఆశయాలు మెచ్చి ఈరోజు పార్టీ లో చేరామన్నారు.ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆశయాలు,ఆదోని నియోజకవర్గం అభివృద్ది పట్ల పార్థసారథి గారికి ఉన్న పట్టుదల ఆదోని నీ అభివృద్ది పథములో ముందుకు నడుపుతారని నమ్మకం తో ఈరోజు పార్టీ లో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ , ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ , ఆదోని పట్టణ అధ్యక్షులు జింద్ సాయి పార్టీ లో చేరిన వారు బోయ నాగి రెడ్డి , బోయ అనిల్ , బోయ రఘు , బోయ వీరేష్ , బోయ బాలరాజ్ ,బోయ లక్ష్మి నారాయణ,సిద్ధు ,బోయ ఈరమ్మ, బోయ త్రివేణీ , బోయ జానకి , బోయ కృష్ణ కుమారి , బోయ హనుమంతమ్మ తదితరులు చేరారు.

About Author