PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరికలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సంగయ్య పేట నందు వైసీపీకి చెందిన మరో వర్గం నాయకులు  జగన్ రఫీ శాప్ చైర్మన్ బైరెడ్డి    సిద్ధార్థ రెడ్డి  సమక్షంలో మంగళవారం  వైసిపిలో చేరారు. జగన్ రఫీ అలాగే  అతని సోదరులు అన్వర్,హమిద్ బాషా,చిన్న హమీద్ భాషారఫీ ముత్తు కాజా , ఐదవ వార్డుకు చెందిన ఎల్ఐసి మహబూబ్ బాషా మరియు జాకీర్ బాషా షారూక్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సిద్దార్థ రెడ్డి వారికి వైసీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, పట్టణ ఉపాధ్యక్షులు ఉపేంద్ర రెడ్డి, మైనారిటీ జోనల్ ఇంఛార్జి అబూబక్కర్, వార్డు ఇంచార్జ్ సనా అబ్దుల్లా, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ లు మనపాడు అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, కోకిల రమణారెడ్డి, బోయ శేఖర్, పట్టణ యూత్ వింగ్ ప్రెసిడెంట్ లడ్డూ, సలాం ఖాన్, ఆయిల్ శెఫీ, రహ్మతుల్లా తదీతరులు పాల్గొన్నారు.

About Author