PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాల కమిటీ ఎన్నికల్లో.. మామ అల్లుడు చైర్మన్ లు

1 min read

తాటిపాటి అయ్యన్న ఆధ్వర్యంలో రెండు కైవసం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మామ..అల్లుడు పాఠశాలల అభివృద్ధి కమిటీ చైర్మన్ లుగా ఎన్నిక అయ్యారు నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలో.. టిడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు శుక్రవారం పాఠశాలల అభివృద్ధి (ఎస్ఎంసీ)కమిటీ నెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ యొక్క ఎన్నికల్లో విజయానికి కృషిచేసిన 26 వ వార్డు కౌన్సిలర్ మందడి వాణి మారుతి నగర్ 12వ వార్డు ఇన్చార్జి తాటిపాటి అయ్యన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో సీఎస్ఐ జిల్లా పరిషత్ పాఠశాల నూతన చైర్మన్ గా తాటిపాటి రమేష్ వైస్ ఛైర్మన్ కస్తూరి మరియు ప్రాథమిక పాఠశాల చైర్మన్ గా ఎం పరమేష్,వైస్ చైర్మన్ గా ఆంజనేయులు ఏకగ్రీవంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికల్లో గెలిచిన నెంబర్  జరిగిన ఎన్నికల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ లుగా ఎన్నికైన వారితో కలిసి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులతో ప్రధానోపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భరత్ భూషణం,సుధాకర్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.సాయంత్రం అల్లూరులో శివానందరెడ్డిని మరియు ఎమ్మెల్యేను నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

About Author