PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇందిరాగాంధీ నగర్లో టిడిపి జెండా ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని 43వ వార్డు ఇందిరా గాంధీ నగర్లో వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఎన్నికల్లో భారీ విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశాగా అడుగులు వేస్తున్నామన్నారు. కర్నూలు నగర అభివృద్ది కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కె. ఏసన్న, వార్డు ఇంఛార్జీ, రాజశేఖర రెడ్డి, బూత్ ఇన్చార్జులు రాము, నాగేశ్వరరావు, ఆంజనేయులు, భాస్కర్, వీరన్న, రవికుమార్ రెడ్డి, నరేష్, ఈశ్వరయ్య, వెంకటేశ్వర చౌదరి, అశోక్ కుమార్, లలితమ్మ, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

About Author