PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛన్ల పెంపు టీడీపీతోనే సాధ్యం

1 min read

నూర్ బేగ్. పెట్రోల్ బంక్ భాష

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ఎన్నికల్లో పింఛన్ల నగదు పెంపు పై ఇచ్చిన హామీని అమలు చేస్తూ లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో  టిడిపి నాయకులు నూర్ బేగ్, పెట్రోల్ బంక్ భాష, బిజెపి నాయకురాలు మోమిన్ షబానా  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ పింఛను మొత్తాన్ని పెంచడంపై లబ్ధిదారుల్లో ఆనందం కనిపిస్తుంది అన్నారు.రాష్ట్రములో ప్రతి ఇంటికి పెద్ద బిడ్డలా అండగా నిలిచిన సీఎం నారా చంద్రబాబు నాయుడికి లబ్ధిదారులందరూ ధన్యవాదములు తెలియజేస్తున్నారని అన్నారు.ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 

About Author