PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చదరంగం సాధనతో మేధాశక్తి పెంపు

1 min read

జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూల్ స్పోర్ట్స్ : విద్యార్థులు క్రమం తప్పకుండా చదరంగం సాధన చేస్తే మేధాశక్తి పెంపొందుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు అన్నారు. కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చదరంగం జిల్లా స్థాయి పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతిరావు మాట్లాడుతూ మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ క్రీడల్లో సాధన చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా చదరంగం సంఘం ప్రధాన కార్యదర్శి మంచికంటి నందకిషోర్ మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా తీసుకొని పోటీల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్సీ సిబ్బంది శేష పని, అసోసియేషన్ సభ్యులు ఇమామ్ హుస్సేన్, బద్రి తదితరులు పాల్గొన్నారు.

About Author