PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

1 min read

వైసిపి తెలుగుదేశం పార్టీలను తరిమికొట్టాలి  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పిలుపు

 ప్రచారం నిర్వహిస్తున్న ఇండియా కూటమి నాయకులు కార్యకర్తలు 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం, ఇచ్చిన హామీలను నెరవేర్చని టిడిపి కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేలిపించారు. సోమవారం పత్తికొండ పట్టణంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ లోక్సత్తా పార్టీల నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. ఇండియా కూటమి బలపరుస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య విజయాన్ని కాంక్షిస్తూ, పత్తికొండలో  రోడ్డు షో కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ, సంక్షేమం పేరిట జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంపై మోయలేని భారాన్ని విధించారని అన్నారు. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని తెలిపారు. రాష్ట్రాన్ని రక్షించడం కోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో పార్టీ బిజెపి పవన్ తెలుగుదేశం పార్టీ జతకట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వచ్చారని, వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని అన్నారు. సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. పత్తికొండలో ఉదయం 10 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ సర్కిల్ కూడలి వరకు రోడ్ షో కార్యక్రమం విజయవంతంగా చేపట్టారు. జరుగుతుందన్నారు.

About Author