PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వం పై నిందలు తగవు

1 min read

ఎన్నికల మ్యానిఫెస్టోలో లో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తాం

ఆలూరు టీడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : టీడిపి కూటమి ప్రభుత్వం పై వైసిపి నాయకులు నిందలు వేయడం సరికాదని ఆలూరు టీడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ అన్నారు..బుధవారం స్థానిక టీడిపి కార్యాలయం లో నిర్వహించిన విలేఖర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ ను సీఎం చంద్రబాబు నెరవేరుస్తాడన్నారు.వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక 8 నెలలకు అమ్మ ఒడి అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు..తప్పకుండా ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి   అమ్మ ఒడి ప్రభుత్వం  అందిస్తుందన్నారు….గురువారం  జరగబోయే పెన్షన్ల పంపిణి కార్యక్రమాన్ని టీడిపి నాయకులు విజయవంతం చేయలన్నారు.ముఖ్యంగా నేడు వెలువడనున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటి ఎన్నిక కోసం ఏ గ్రామం లో ఉన్న   ప్రభుత్వ స్కూల్ లో పిల్లలుల  చదువుతున్న  స్కూల్ లో మాత్రమే ఆసక్తి గల వారు చైర్మెన్ గా పోటీ చేయొచ్చన్నారు.కార్యక్రమం లో టీడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author