PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీచర్స్ మద్దతు కి జేఏసీ కూడా నైతిక మద్దతు ఇవ్వాలి

1 min read

ఉపాధ్యాయ,పెన్షనర్ల విజయం ఆకాంక్షించిన జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో జిల్లా జె ఏ సి చైర్మన్ చోడగిరి శ్రీనివాస్  కి సభ కన్వీనర్ నెరుసు రామారావు లను కలసిన యూటీఫ్ రాష్ట్ర కోశాధికారి మరియు ఉభయ గోదావరి జిల్లాల కు సంబంధించిన టీచర్స్ కాంస్టిట్యూన్సీ కి యూటీఫ్ రాష్ట్ర నాయకత్వం బలపర్చిన అభ్యర్థి బొర్రా గోపి మూర్తి. ఈ సందర్భంగా గోపి మూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లు. కార్మికుల తరుపున దశాబ్దాలుగా  పిడిఎఫ్ ఎమ్మెల్సీలు తమ గళాన్ని శాసనమండలి లో లెవనెత్తుతూ పోరాటం చేస్తున్నారని, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న టీచర్స్ మద్దతు కూడగట్టుకొని.జె ఏ సి ని కూడా నైతిక మద్దతు ఇవ్వాలని తన అభ్యర్ధిత్వాన్ని బలపర్చమని కోరారు. ఈ సందర్భంగా జె ఏ సి చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, కన్వీనర్ రామారావు లు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం యొక్క గళం శాసనమండలి లో వినిపించేలా  ప్రతి యొక్క పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఇప్పటివరకు కృషి చేశారని,జె ఏ సి లో భాగస్వామ్యం గా ఉన్న యూటీఫ్ నాయకత్వం పోరాట స్ఫూర్తి తో పనిచేసే గోపిమూర్తి లాంటి మంచి అభ్యర్థి ని పోటీ కి నెలబెట్టిందని వారి విజయం ఉద్యోగుల. ఉపాధ్యాయ,పెన్షనర్ల,కార్మిక విజయం కావాలని ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *