PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల తీర్పుతో బాబు గద్దెనెక్కడం-జగన్ ఇంటికెల్లడం ఖాయం

1 min read

టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెల్లడి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రంలో గడిచిని 5 సంవత్సరాలలో కొనసాగినటువంటి జగన్ రాక్షసపాలనకు నిన్నటితో రాష్ట్ర ప్రజలు చరమ గీతం పాడారనీ కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు వారిరువురు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా, మీడియా ప్రతనిధుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేది 13-05-2024న జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయినీ, ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనది మొదులుకొని నిన్నటి దినం వరకు తెలుగుదేశం, బి.జె.పి, జనసేన పార్టీలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి, ఎప్పటికప్పుడు వై.సి.పి. ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక విధానాలను తెలుపుతూ, ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గురించి ప్రతిపక్షపార్టీలకు, ప్రజలకు తెలియజెపుతూ, ప్రతిపక్ష పార్టీలను అప్రమత్తం చేసింనందులకు, పత్రికా, మీడియా ప్రతినిధులందరికి పేరుపేరునా కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ తరుపున కృతజ్ఞతలు, తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ బిజెపి, జనసేన నాయకులకు, టిడిపి వివిధ స్థాయిలలో ఉన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, జిల్లా ప్రజానీకానికి, అలాగే ఎన్నికలు ప్రశాంతంగా జరిపినటువంటి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్కి, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గముల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, సహయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, జిల్లా పోలీస్ శాఖ యస్.పి. కి, పోలీస్ ఉన్నతాధికారుకలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె. నాగేంద్రకుమార్, చంద్రశేఖర్, జె. తిరుపాల్ బాబు, సోమిశెట్టి నవీన్, పి.హనుమంతరావు చౌదరి, ముంతాజ్, సత్రం రామక్రిష్ణుడు, పి. రవికుమార్, రాజూయాదవ్, కుర్వ వెంకటేశ్వర్లు, మొదలగు వారు పాల్గొన్నారు.

About Author