PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎంగా జగనన్నను గెలిపించుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం పార్టీ ఆఫీస్ నందు బూత్ కమిటీ సభ్యుల మీటింగ్ కి ముఖ్య అతిథులుగా  వైస్సార్సీపీ ఆలూరు అసెంబ్లీ అబ్జర్వర్, కర్నూల్ జిల్లా జేసీఎస్ కో ఆర్డినేటర్ తెర్నకల్ సురేంద్రరెడ్డి , బుషినే చంద్రశేఖర్ . సురేంద్రరెడ్డి మాట్లాడుతు గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకో వాలని వైఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ పరిశీ లకుడు తెర్నేకల్ సురేందర్ రెడ్డి అన్నారు. బూత్ కమిటీ మెంబర్స్, ఎంపీపీలు, సర్పంచులు, జేసీఎస్ మండల కన్వీనర్లు,  వైఎస్సార్సీపీ నాయ కులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి నాయకులు, కార్య కర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు , వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి బుసినె విరుపాక్షిని ఎంపీ అభ్యర్థి బి వై  రామయ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎంపిపి మారయ్య, తెర్నకల్ సర్పంచ్ అరుణ కుమార్,కర్నూల్ జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షులు ,వైస్సార్సీపీ పార్టీ మండల నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author