PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : 14 వ వార్డ్ పెద్ద కటిక గేరి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక ,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్   వై రుద్ర గౌడ్ ,వార్డ్ కౌన్సిలర్ ఖాసింబేగ్ , పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశ్వీరదించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక విన్నవించారు. వ్యాపారులు, వృ ద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకో వాలని పిలుపునిచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే అందేవని, ఇప్పుడు జగనన్న పాల నలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బుట్టా శివ నీలకంఠ ,వార్డు నాయకులు మహబూబ్ బేగ్,ఖాదర్ బేగ్,అబ్దుల్లా,హజరత్ వార్డు కార్యకర్తలు ఇమ్రాన్ బక్కర్,షేక్షావాలి,లక్షమన్న,వెంకటేష్, బషీర్,అహమ్మద్,మజీద్ ,రాహిమాన్ ,రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చెర్మెన్ బుట్టా శారద,పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య,జిల్లా వక్ఫ్ బోర్డ్ ఉపాధ్యక్షులు రియాజ్ అహమ్మద్ ,పట్టణ అధికార ప్రతినిధి సునీల్,కౌన్సిలర్లు వాహీద్ ,అమానుల్లా,ఇషాక్ , టౌన్ బ్యాంక్ మాజీ చెర్మెన్ బి.ఎన్. నాగరాజు ,మాధవస్వామి ,యు యు రమేష్ ,డిష్ రఫీ, కుమార్,జిక్రియా,హనీఫ్,కలాం,బంటుపల్లి ప్రభాకర్, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

About Author