PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ పాలనలోనే పేదలకు మేలు                   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  జగన్ పాలనలో ప్రతి ఇంటికీ లబ్ధిచేకూరిందని, అలాగే పేదలకు మేలు జరిగిందని వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గo ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ  అన్నారు. సోమవారం పత్తికొండ పట్టణం రాజీవ్ నగర్ , బండగేరి కాలనీ లలో మాజీ ఎంపిపి నాగరత్నమ్మ ,ఎంపిపి నారాయణ దాస్,సర్పంచ్ కొమ్ము దీపిక, వైస్ సర్పంచ్ పల్లె కళావతి గారితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి వృద్దులు, మహిళలను ఆప్యాయంగా పలకరించారు. ఐదేళ్లలో జరిగిన మంచిని వివరించారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణ మాఫీ చేస్తానని గతంలో మోసం చేశాడని, మరోసారి అవే అబద్ధాలతో ఓటు అడిగేందుకు వచ్చినా నమ్మొద్దని సూచించారు.పారదర్శక పాలన చేస్తున్న జగన్మోహన్రెడ్డినే మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా, బీవై రామయ్యను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పత్తికొండ పట్టణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంపిటిసి మెంబర్లు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author