PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపిలో చేరిన వైసీపీ రాష్ట్ర మ‌హిళా కార్యద‌ర్శి జ‌మీలా బేగం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వైసీపీ రాష్ట్ర మ‌హిళా కార్యద‌ర్శి స‌య్యద్ జ‌మీలా బేగం తెలుగుదేశం పార్టీలో చేరారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో ఆమె టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భ‌ర‌త్ ఆమెతో పాటు 22వ వార్డుకు చెందిన మ‌హిళ‌లు, యువ‌కుల‌కు కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా జ‌మీలా బేగం మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమ‌వుతుంద‌న్నారు. టి.జి భ‌ర‌త్ లాంటి విజ‌న్ ఉన్న నాయ‌కుడితోనే క‌ర్నూలు ప్రజ‌ల‌కు స‌రైన సంక్షేమం, అభివృద్ధి ఉంటుంద‌న్నారు. క‌ర్నూల్లోని యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాది అవ‌కాశాలు క‌ల్పించేందుకు టి.జి భ‌ర‌త్ కృషి చేస్తార‌న్న న‌మ్మకం త‌న‌కుంద‌న్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నాయ‌కుడు టి.జి భ‌ర‌త్ అని ఆమె కొనియాడారు. పార్టీలో చేరిన వారిలో భ‌గ‌త్, అప‌ర్ణ‌, త‌హేరా, రాణి, చిన్న‌, త‌దిత‌రులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు రామాంజనేయులు, మోయిన్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

About Author