PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు పెంపు

1 min read

జనసేన పార్టీ సభ్యత్వం మీకు మీ కుటుంబానికి భరోసా

జనసేన మండల నాయకులు రాంబాబు

పల్లెవెలుగు వెబ్ కౌతాళం:  కౌతాళం పల్లెవెలుగు న్యూస్ జూలై 31 మండల కేంద్రమైన కార్యక్రమం నిర్వహించగా ప్రజలకు జనసేనా క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును పొడిగించినట్లు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  తెలిపారు. మరో వారం రోజులపాటు సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసినట్లు ప్రకటించారు. కౌతాళం మండల సభ్యత్వ నమోదుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ సభ్యత్వం మీకు మీ కుటుంబానికి భరోసానిస్తుందని పార్టీ సభ్యత్వం చివరికి ఇది ఆగస్టు 5వ తారీఖు వరకు ఉంటుందని జనసేన పార్టీ నాయకులు రాంబాబు తెలిపారు. జనసేన సైనికులు కౌతాళం రాంబాబురౌడూరు మహమ్మద్, ఊసేని సులేకేరి మారుతీ, తదితరులు అభిమానులు పాల్గొన్నారు.

About Author