PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జై శ్యాం కుమార్ గెలుపు కోసం జనసేన పార్టీ విస్తృత ప్రచారం     

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : NDA కూటమి అభ్యర్థి KE శ్యామ్ కుమార్ గెలుపు కోసం పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తుగ్గలి మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టింది.  అభ్యర్థి కే ఈ శ్యామ్ కుమార్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తుగ్గలి నాగేంద్ర, జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త సిజి రాజశేఖర్  తుగ్గలి మండలంలో కేఈ శ్యామ్ కుమార్ గారిని గెలిపించాలని, తుగ్గిలి మండలంలో, కొట్టాల, రాంపురం, చిన్నజొన్నగిరి, జాప్లతండ, లక్ష్మీ తండా, గుండాల తండా, CG తండా, పై చెరువు తండా, కింద చెరువు తండా, ఎర్రగుడి, రోలపాడు రోళ్ళపాడు తండా ఎల్లమ్మ గుట్ట తండా బాటతాండ మిట్టతాండా సూర్య తండా ఉపర్ల పల్లె జొన్నగిరి గ్రామాలలో  పర్యటించడం జరిగింది, మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే  పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీరాలంటే ముఖ్యంగా విద్యా వైద్యం ఉపాధి కావాలంటే ఉమ్మడి అభ్యర్థి గెలవాలని, గెలిస్తేనే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుగ్గలి మండలం తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, గల్లా రామచంద్ర ,భీమేష్ ,అంజి, భార్గవ్, రాజశేఖర్, వడ్డే వీరేష్, మరియు జయవంతం  చేసి ప్రతిఒక్క జనసైనికుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేశారు.

About Author