PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాస్తి శ్రీనివాసరావు స్నేహితులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం

1 min read

సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

30 రోజులగా మజ్జిగ, మంచినీరు వందలాదిమంది కి పంపిణీ

గత ఆరు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు

అధ్యక్షులు ఎన్ వివి ఎస్ ప్రసాద్, సెక్రటరీ డి భాస్కరరావు

సంఘ సభ్యులను అభినందించిన పలువురు పాదచారులు, వాహనదారులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ‍జాస్తి శ్రీనివాసరావు స్నేహితులు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్  అసోసియేషన్  వారి ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ, మంచినీరు నిత్యం సుమారు వంద మంది పాదచారులకు, వాహనదారులకు, వ్యాపారస్తులకు దాహార్తి తీరుస్తూ సేవలందిస్తు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్  సిటిజెన్స్ మాట్లాడుతూ సమాజానికి సేవలందించేది మానవత్వం కలిగిన మనమే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని శ్రద్ధ చూపటంలో వారి ఆరోగ్యం పరిరక్షించడంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ముందుంటారు అన్నారు. అధ్యక్ష, కార్యదర్శు, కోశాధికారులను వారి సేవలను పలువురు కొనియాడారు. అధ్యక్షులు ఎన్ వివిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ మా అసోసియేషన్ గత ఆరు సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నామని రాబోయే రోజుల్లో  ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయటానికి మా  అసోసియేషన్ సంఘ ‌సభ్యులందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారని తెలియపరిచారు. ప్రజలకు సేవలు అందించడమే మా ప్రధాన ధ్యేయం అన్నారు. ఎండల తీవ్రత మరింత ఎక్కువైతే మరిన్ని రోజులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారంటూ పలువురు ప్రశంసలు తెలియజేశారు.

About Author