PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీరు సాహెబ్ పేట ఉప సర్పంచ్..టిడీపీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మండలం పీరు సాహెబ్ పేట గ్రామ ఉప సర్పంచ్ దండగల విష్ణు మరియు వార్డు మెంబర్ దండగల గోపి,దండగల రాజు వైసీపీ నుండి టిడీపీ పార్టీలో చేరారు.గ్రామ టిడిపి నాయకులు ఎడమకంటి  రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం అల్లూరు గ్రామంలోని శివానందరెడ్డి స్వగృహంలో వారు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.వారికి శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మీనిగ మహేశ్వర్ రెడ్డి,మల్లికార్జున, మధు,రాము పాల్గొన్నారు.

About Author