PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యం ఆర్ పి ఎస్ యువజన సంఘం ఆధ్వర్యంలో  వైసీపీ లో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: యం ఆర్ పి ఎస్, యువజన సంఘానికి చెందిన 14 వ వార్డు, మహిళలు, కార్యకర్తలు,దాదాపు 200 మంది శనివారం వైసీపీ యం యల్ ఏ అభ్యర్థి ఇంతియాజ్, మాజీ యం యల్ ఏ SV. మోహనరెడ్డి ఆధ్వర్యంలో, పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ లో చేరారు.వైసీపీ నాయకులు మహేష్ గౌడ్, విజయప్రసాద్, జె. నాగరాజు ఆధ్వర్యంలో చేరారు. యం యల్ ఏ, అభ్యర్థి ఇంతియాజ్,మాజీ యం యల్ ఏ,మోహనరెడ్డిపార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ, జగనన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై, పార్టీ లో చేరుతున్నారని, అన్నారు. ప్రతి కార్యకర్త ఈ ఎన్నికల్లో కష్టపడి, జగనన్న పథకాలను ప్రజల్లోకి చేరవేసి, వైసీపీ పార్టీ ని అధికారంలోనికి తీసుకు రావాలని అన్నారు కార్యకర్తలకు ప్రతి నిత్యం అండగా ఉంటానని ఇంతియాజ్ హామీ నిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author