PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చౌటుకూరు,గుడిపాడు గ్రామాల్లో టిడిపిలో చేరిక..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని చౌటుకూరు, గుడిపాడు గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. శుక్రవారం ఉదయం గ్రామాలకు వచ్చిన నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య చౌటుకూరు గ్రామానికి రాగా వీరికి ఈడిగ నరసింహ గౌడ్, లక్ష్మీనారాయణ,షహబాజ్ ఖాన్,గోకారి ఆధ్వర్యంలో మేళ తాళాల నడుమ గ్రామంలో ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు.పార్టీలో చేరిన వారిలో గుడిపాడులో కుంచపు మహేష్,తోట శ్రీనివాసులు లక్ష్మన్న చాకలి ఎల్లస్వామి చిన్న లక్ష్మన్న పెద్ద గోపాల్ తదితర కుటుంబాలు పార్టీలో చేరారు.చౌటుకూరులో నరసింహ గౌడ్,షహబాజ్ ఖాన్ తో పాటు ఈ లక్ష్మీనారాయణ,చంద్ర స్వా మప్ప,వి స్వాములు,గంట ఎల్లారెడ్డి,కుమ్మరి తిరుపాలు, అబ్దుల్లా,లాలు,కుంచపు ఎల్లన్న,గూడెం వెంకటేశ్వర్లు 100 కుటుంబాలు పార్టీలో చేరారు.గ్రామంలోని ఎస్సీ బీసీ మైనారిటీ కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మహిళల ప్రజలతో మాండ్ర శివానందరెడ్డి, గిత్త జయసూర్య మాట్లాడారు. మీరంతా మంచి మనసుతో స్పందించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని  నేను అల్లూరు గ్రామానికి చెందిన వాడను ఇక్కడి సమస్యలు నాకు బాగా తెలుసు కావునా మీరంతా నన్ను గెలిపించాలని జయ సూర్య చేతులు జోడిస్తూ ఓటర్లను కోరారు.గ్రామంలో ముఖ్య కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి వారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుండం రమణారెడ్డి,సంపంగి రవీంద్రబాబు,సర్వోత్తమ రెడ్డి, జయరాముడు,మహేశ్వర రెడ్డి, యరభం ప్రమోద్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు సామన్న,కాసిం వల్లి,సర్దార్,వడ్డే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author