PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక‌లు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలోని 6వ వార్డుకు చెందిన వైసీపీ నాయ‌కుడు షేక్ ఇంతియ‌జ్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న‌తో పాటు సాజిద్ బాషా, స‌ర్దార్, ఉమర్, జుబేర్, త‌దిత‌రులకు టి.జి భ‌ర‌త్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రానికి మంచి జ‌రుగుతుంద‌ని టి.జి భ‌ర‌త్ చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు క‌ష్టప‌డాల‌ని వారికి భ‌ర‌త్ సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జి ఆర్షద్, టిడిపి 6వ వార్డు ఇంచార్జి ఇబ్రహీం, ఉస్మాన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author