PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ‘జోయాలుక్కాస్​ ’

1 min read

కర్నూలు,పల్లెవెలుగు: పంచ వాణిజ్య రంగంలో తనదైనశైలిలో రాణిస్తున్న ‘జోయాలుక్కాస్​ ’.. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బంగారు ఆభరణాలు తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. వివిధ ఆకృతులలో నాణ్యమైన వజ్రాలు, బంగారు, సిల్వర్​ ఆభరణాలు రూపొందించడమేకాకుండా … తక్కువ ధరకు విక్రయిస్తూ మహిళాలోకాన్ని ఆకర్షిస్తోంది. గోల్డ్​, డైమండ్స్​, ప్రెషస్​ మరియు సిల్వర్​ జ్యువెలరీ తయారీ (మజూరీ) చార్జీలలో 50 శాతం తగ్గింపుతో ఇస్తున్నట్లు ప్రకటించిన యాజమాన్యం .. ఆదివారం జోయాలుక్కాస్​ కర్నూలు బ్రాంచ్​లో వినియోగదారులు జె. రాధిక, మహబూబ్​ బాష, హర్ష తదితరులు  బంగారు ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నయా ఆభరణాలు రూపొందించడమేకాకుండా.. వినియోగదారులకు అనుకూలమైన ధర, మజూరీ చార్జీలో 50 శాతం తగ్గింపు ఇవ్వడం అభినందనీయమన్నారు.  అనంతరం కర్నూలు బ్రాంచ్​ మేనేజర్​ ఐ.లిగేష్​ మాట్లాడుతూ కస్టమర్ల అభిప్రాయాలు… అభిరుచులకు అనుగుణంగా తమ సంస్థ బంగారు ఆభరణాలు రూపొందిస్తోందన్నారు. ఆర్డర్​ ఇస్తే…వినియోగదారులకు కావాల్సిన రూపంలో  బంగారు, సిల్వర్​ ఆభరణాలు తయారు చేయించడంలో తమ సంస్థ ముందుంటుందన్నారు. ఏడాదికోసారి ప్రత్యేక ఆఫర్​ ఇవ్వడం జోయాలుక్కాస్​ సంస్థ కు మాత్రమే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జోయాలుక్కాస్​ సిబ్బంది వెంకట్​, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

About Author