PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూలై 1న ఇంటి దగ్గరే పెన్షన్ల పంపిణీ

1 min read

హోలగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో కన్వీనర్ డాక్టర్ తిప్పాయ్యా  మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  జులై 1నా తారీఖున పెన్షన్ దారులకు 3000 ఉన్న పింఛన్లు 4000 వేలకు పెంచి మరియు మూడు నెలల బకాయిలు 3000 వెలు రూపాయిలుతో కలిపి ఒకేసారిగా ఒకటో తారీఖునా అంటే 7000వెలు ఇంటి దగ్గరే పెన్షన్ల ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నా నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ 3000 రూపాయలు చేయడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఐదు సంవత్సరాలు టైం పట్టింది అని కానీ మన ముఖ్యమంత్రి అపార చన్యుకుడు నారా చంద్రబాబు నాయుడు కి ఒకేసారిగా ఒకే విడతల్లో మూడు నెలల బకాయలు మరియు 4000 వేల పెన్షన్ ఒకేసారి ఇంటి దగ్గరికి వచ్చే విధంగా చర్యాలు చేసుకుంటున్నారు అది చంద్రబాబు నాయుడు  గొప్పతనం అని అన్నారు.రేపు ఒకటో తారీఖున మండల పరిధిలో ఉన్న టిడిపి, బిజెపి, జనసెన కూటమి నాయకులు, సీనియర్ నాయకులు యువ నాయకులు,TNSF,ITDP నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్ దారులకు, పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం.

About Author