PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడీపీతోనే…అన్ని వర్గాలకు న్యాయం

1 min read

-ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి

-ఎన్నికల ప్రచారంలో మాండ్ర శివానందరెడ్డి

నందికొట్కూరు (మిడుతూరు), పల్లెవెలుగు: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నంద్యాల పార్లమెంటు టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని అలాగనూరు, సుంకేసుల,మిడుతూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శివానందరెడ్డి రోడ్డు షో నిర్వహించారు.నాయకులు వీరికి బాణాసంచా కాలుస్తూ పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాత్రి 7:30 కు మిడుతూరులో జరిగిన సభలో శివానందరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో అలగనూరు రిజర్వాయర్ కు గండి పడిందని వాటిలో ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండటం లేదని ఇంతవరకు గండిని పూడ్చక పోవడం విడ్డూరమని వాటిలో నీళ్లు ఉంటే నీళ్ల ద్వారా అక్కడ ఉన్న రైతుల పంటలు సస్యశ్యామలం అయ్యేవని అన్నారు.టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే రిజర్వాయర్ గండి మరమ్మతులు వెంటనే చేయిస్తామన్నారు.రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల లాడుతున్నారని పేదరికం నుండి వచ్చిన జయసూర్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ ప్రాంత వాసి మీ ఆశీర్వాదాలు మీ దీవెనలు ఆయనపై ఉంచి అఖండ మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరిని గెలిపించాలన్నారు.ఆయనను గెలిపిస్తే మీ రుణం తీర్చుకోలేనిదని మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి,తువ్వా భగీరథ రెడ్డి, సుంకేసుల భూపాల్ రెడ్డి, అలగనూరు సుధాకర్ యాదవ్, సర్వోత్తమ్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి,సుల్తాన్,సుధాకర్ రెడ్డి,గోకారి,నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author