PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాము కాటుకు గురైన మహిళను పరామర్శించిన.. కాశీభట్లసత్య సాయినాథ్ శర్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  మండలంలోని రామనపల్లె పల్లె గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన మద్దూరి వెంకట లక్ష్మమ్మ మహిళ ఇటీవల పాము కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి రావడంతో, ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నాయకులు కాశీబట్ల సాయినాధ శర్మ బాధిత మహిళ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి, ఆమె ఆయురారోగ్యాల గురించి అడిగి తెలుసుకున్నారు, ఆమె తన కుటుంబం గురించి ఆయనకు తెలియజేస్తూ తన భర్త మద్దూరి వెంకటసుబ్బయ్యకు చాలా రోజుల కిందట పెరాలసిస్ సోకడంతో ఇంటి పరిస్థితి బాగోలేక తానే కూలి పనులకు వెళుతూ కుటుంబ పోషణ సాగిస్తున్నానని ఆమె సాయినాథ శర్మ దృష్టికి తీసుకోవడం జరిగింది, ఆమె కుటుంబ సమస్యలకు చెల్లించి పోయిన కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ ఆమెకు వెంటనే కొంత నగదు అందజేయడంతో పాటు, ఆమె కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు సాయినాథ శర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర మోహన్ రెడ్డి, దేవి రెడ్డి మాధవరెడ్డి,శివ  తుపాకుల జనార్దన్ రెడ్డి, చంగా బ్రహ్మయ్య, బరకం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 

About Author