PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ మెంబర్ బొగ్గుల నాగరాజ్ (బైరాపురం  రాజు) ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి  విన్నపం… ఈ రోజు ఉదయం 11 గంటలకు కర్నూలు బిర్లా గేట్ MRPS ఆఫీస్ నందు విలేకరుల సమావేశంలో కర్నూల్ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బొగ్గుల నాగరాజు( బైరాపురం రాజు ) మాట్లాడుతూ కోడుమూరు sc అసెంబ్లీ నియోజకవర్గం లో గత 30సంవత్సరాలుగా టిడిపి పార్టీ గెలవలేదు అయితే ఈసారి టిడిపి పార్టీ నుంచి  దళితుడైన బొగ్గుల దస్తగిరి అత్యధిక మెజార్టీతో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా అతి సామాన్యుడు, నాడు తల్లి సర్పంచ్ గా,నేడు కొడుకు కోడుమూరు ఎమ్మెల్యేగా ప్రజలలో నిత్యం ఉంటున్న బొగ్గుల దస్తగిరి కి మంత్రివర్గంలో స్థానం కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి మీడియా ద్వారా విన్నపం చేశారు ఎందుకంటే అతి సామాన్యులకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే బొగ్గుల దస్తగిరి కి మంత్రిగా అవ్వడం చాలా అవసరం అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గం గాని, కర్నూలు జిల్లా  చాలా అభివృద్ధి చెందుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరిని ఆదరించే బొగ్గుల దస్తగిరికి  క్యాబినెట్లో హోదా కల్పిస్తే ఎనలేని అభివృద్ధి చేయగలరని  అని మీడియా సమావేశంలో కర్నూల్ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బొగ్గుల నాగరాజు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమం లో రాముడు, నాగన్న,వెంకటేష్, మధు, అశోక్,అర్జున్ మరియు కర్నూలు జిల్లా MRPS నాయకులు పాల్గొన్నారు.

About Author